‘గుమ్మడి’ని పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ.. కాకా అభిమానులకు కష్టసుఖాల్లో అండగా ఉంటాం

‘గుమ్మడి’ని పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ.. కాకా అభిమానులకు కష్టసుఖాల్లో అండగా ఉంటాం

గోదావరిఖని, వెలుగు: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్​లో ట్రీట్​మెంట్​ తీసుకుని వచ్చిన కాకా వెంకటస్వామి కుటుంబ అభిమాని, కాంగ్రెస్​ లీడర్​ గుమ్మడి కుమారస్వామిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం పరామర్శించారు. 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్​నగర్​లోని ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్​ లీడర్​ రాచకొండ కోటేశ్వర్లును ఎంపీ పరామర్శించారు.

 కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కష్టసుఖాల్లో అండగా నిలుస్తామని ఎంపీ భరోసా కల్పించారు. ఆయన వెంట పి.మల్లికార్జున్, కామ విజయ్, దుబాసి మల్లేశ్, మల్లేశ్​ యాదవ్, తిప్పారపు మధు, గడ్డం మధు, మగ్గిడి దీపక్, రఫీక్  పాల్గొన్నారు.