పుణ్య స్నానానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం..పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో ఘటన

పుణ్య స్నానానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం..పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో ఘటన
  • నుజ్జునుజ్జయిన మహిళ కాలు తొలగించిన డాక్టర్లు
  •     కొడుకుకు తీవ్రగాయాలు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా బసంత్​నగర్​ టోల్​గేట్​ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు నుజ్జునుజ్జు కాగా, వారిని కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన ట్రాక్టర్​ డ్రైవర్  పినకాసి సతీశ్, భార్య స్వప్న, కొడుకు విక్కీతో కలిసి బైక్​పై శనివారం అంతర్గాం మండలం గోయిల్​వాడ సమీపంలో గోదావరి నదికి స్నానానికి వెళ్లి, తిరుగు ప్రయాణమయ్యారు. 

బసంత్​నగర్​ టోల్​గేట్​ దాటిన తర్వాత రాజీవ్​ రహదారిపై పక్క నుంచి వెళ్తున్న లారీ బాడీ బైక్  హ్యాండిల్​కు తగలడంతో సతీశ్​ కుడివైపు డివైడర్​ మధ్యలో పడగా, భార్య స్వప్న, కొడుకు విక్కీ ఎడమవైపు లారీ టైర్​ కింద పడ్డారు. ఈ ఘటనలో స్వప్న కుడి కాలు, విక్కీ కుడి చేయి, కాలు నుజ్జునుజ్జయ్యాయి. 

స్థానికులు అంబులెన్స్​ ద్వారా వారిని కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. స్వప్నకు ఆపరేషన్​ చేసి కుడి కాలు తొలగించారు. శనివారం సాయంత్రం కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లాల్సి ఉండగా, గోదావరి నదికి స్నానం చేయడానికి వచ్చారు. బసంత్​నగర్​ పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.