
సౌతాంప్టన్ (ఇంగ్లండ్): బెన్ డకెట్ (84), జెమీ స్మిత్ (60) బ్యాటింగ్లో దంచికొట్టడంతో.. మంగళవారం రాత్రి ముగిసిన ఆఖరిదైన మూడో టీ20లోనూ ఇంగ్లండ్ 37 రన్స్ తేడాతో వెస్టిండీస్పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 248/3 స్కోరు చేసింది. డకెట్, స్మిత్ తొలి వికెట్కు 120 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. బట్లర్ (22) ఫర్వాలేదనిపించినా చివర్లో హ్యారీ బ్రూక్ (35), జాకబ్ బీథెల్ (36 నాటౌట్) చెలరేగారు.
ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 31 బాల్స్లోనే 70 రన్స్ జత చేసి భారీ స్కోరు అందించారు. అకీల్ హుస్సేన్, గుడకేశ్ మోతీ, రూథర్ఫోర్డ్ తలా వికెట్ తీశారు. తర్వాత వెస్టిండీస్ 20 ఓవర్లలో 211/8 స్కోరుకే పరిమితమైంది. రొవ్మన్ పావెల్ (79 నాటౌట్) టాప్ స్కోరర్. షాయ్ హోప్ (45), హెట్మయర్ (26), జేసన్ హోల్డర్ (25) పోరాడి ఫెయిలయ్యారు. ల్యూక్ వుడ్ 3, ఆదిల్ రషీద్ 2 వికెట్లు పడగొట్టారు. డకెట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, బట్లర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.