జమ్ము కశ్మీర్‌లో ఎదురు కాల్పులు: నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లో ఎదురు కాల్పులు: నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లోని షోపియన్ జిల్లా కిలూరా ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఇవాళ(శుక్రవారం) ఉదయం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. వీరు వచ్చిన విషయాన్ని గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో… అలర్టైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపాయి.