నేపాల్ లో భూకంపం..తీవ్రత ఎంతంటే.?

నేపాల్ లో  భూకంపం..తీవ్రత ఎంతంటే.?

తూర్పు నేపాల్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆగస్టు 22న రాత్రి 11:15 గంటలకు సంఖువాసభ జిల్లాలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, ఈ భూకంప కేంద్రం మగంగ్‌ ప్రాంతంలో ఉంది.  తూర్పు నేపాల్‌లోని చాలా  జిల్లాల్లో కూడా భూకంపం సంభవించిందని అయితే ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని అధికారులు తెలిపారు.

ఇటీవల మే నెలలో వారం రోజుల్లో మూడుసార్లు నేపాల్ లోని సోలుఖుంబు ప్రాంతం కేంద్రంగా భూకంపాలు వచ్చాయి.  అది కూడా తీవ్రత 4 పాయింట్లపైనే ఉండటంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతం కింద టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నాయని.. వీటి కదలిక ఎక్కువగా ఉందని.. అందుకే తరచుగా వస్తు్న్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

2015లో ఇదే ప్రాంతంలో ఏర్పడిన భూకంపం వల్ల 9 వేల మంది చనిపోగా.. లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఆ తర్వాత ఆ స్థాయి తీవ్రతతో భూకంపం రాకపోయినా.. ఇటీవల కాలంలో.. ముఖ్యంగా ఈ మే నెలలో.. వారం రోజుల్లోనే మూడు సార్లు భూకంపం రావటం.. అది కూడా 4 పాయింట్ల తీవ్రత కంటే ఎక్కువగా ఉండటం అనేది భయాందోళనలకు గురి చేస్తోంది. నేపాల్ లో భూకంపం వస్తే.. అది ఉత్తరభారతదేశాన్ని.. ముఖ్యంగా ఢిల్లీని కూడా వణికిస్తుంది.