రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 27,130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 485 మంది వైరస్ సోకినట్లు తేలింది. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ 19 బారిన పడ్డ వారి సంఖ్య 8,00,476కు చేరింది. గడిచిన 24గంటల్లో 236 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. 

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.51శాతం ఉందని, రికవరీ రేటు 98.93శాతం ఉందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి. గ్రేటర్ లో 257మంది కరోనా బారిన పడగా.. రంగారెడ్డిలో 48, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 37, ఖమ్మంలో పది కొత్త కేసులు రికార్డయ్యాయి.