చట్టసభల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి : మంత్రి మహేందర్ రెడ్డి

చట్టసభల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి : మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్, వెలుగు : స్థానిక సంస్థల్లో మాదిరిగానే చట్టసభల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించి గౌరవించాలని రాష్ట్ర భూగర్భ గనులు, పౌర సంబంధాలు, సమాచార శాఖ  మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా  కోట్ పల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం గురువారం నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్,  తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. 

అనంతరం కోట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. కొత్తగా నియామకమైన చైర్ పర్సన్ మణెమ్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ ఫయాజుద్దిన్ తో పాటు పాలకవర్గ సభ్యులు  రైతులకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.