50 ఫోన్లు రికవరీ...బాధితులకు అందజేత

50 ఫోన్లు రికవరీ...బాధితులకు అందజేత

వికారాబాద్, వెలుగు : వికారాబాద్​జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 50 ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వాటిని శుక్రవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే సీఈఐఆర్​లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

చోరీకి గురైన, మిస్సయిన ఫోన్లను గుర్తించడానికి జిల్లా పోలీసులు పలు రకాల టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. రికవరీ చేసిన 50 ఫోన్ల విలువ రూ.8లక్షల36 వేలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఇన్​స్పెక్టర్లు బలవంతయ్య, అన్వర్ పాషా, ఎస్సైలు జయశంకర్, కృష్ణయ్య పాల్గొన్నారు.