
వికారాబాద్, వెలుగు : జిల్లాలోని బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె.వెంకటేశం ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. జిల్లా కో – ఆపరేటివ్ సొసైటీ తరఫున రూ. 50 వేల చెక్ ను గురువారం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ఎస్పీ కోటి రెడ్డి అందజేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా పోలీస్ సంఘం ప్రెసిడెంట్ అశోక్, కో – ఆపరేటివ్ ఎస్ఐ ఫయాజ్ అలీ, సిబ్బంది ఉన్నారు.