పాలిసెట్ కు 56 వేల 437 అప్లికేషన్లు

పాలిసెట్ కు 56 వేల 437 అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్), అగ్రికల్చర్ కోర్సులతో పాటు పలు డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ ఎగ్జామ్ కు 56,437 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. పాలిసెట్ దరఖాస్తులకు ఈ నెల 22 వరకూ గడువు ఉందని పేర్కొన్నారు. రూ.100 ఫైన్​తో ఏప్రిల్ 24 వరకూ, రూ.300 ఫైన్​తో ఏప్రిల్ 26 వరకూ ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.