కేరళలో (kerala) దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన పాలాలోని పూవరాణి జరిగింది. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులున్నారు. నలుగురు హత్యకు గురైనట్లు సమాచారం అందుతోంది. ఐదవ వ్యక్తి, పాలాలోని పూవరాని వద్ద జందుపరకు చెందిన జైసన్ థామస్గా గుర్తించారు. థామస్ ఆయన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు.......
ఈ ఘటన మంగళవారం ( మార్చి 5) వెలుగులోకి వచ్చింది. పోలీసుల అంచనా ప్రకారం, థామస్ తన భార్య మెరీనా (29)ను తలపై రాయితో కొట్టి, వారి పిల్లలైన జెరాల్డ్ (4), జెరీనా (2), ఏడు నెలల జెరిల్లను గొంతుకోసి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సన్, మెరీనా ఇద్దరూ ఉరులికున్నం స్థానికులు. థామస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ కుటుంబం గత రెండేళ్లుగా పూవరాణిలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.