హైదరాబాద్సిటీ, వెలుగు: మంజీరా ప్రాజెక్టుకు సంబంధించి కలబ్గూర్ సబ్స్టేషన్లో 33 కేవీ అవుట్డోర్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఏర్పాటు, ఇతర మెయింటెనెన్స్పనుల కారణంగా బుధవారం నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారుల తెలిపారు.
ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఆర్సీ పురం, అశోక్నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, హఫీజ్పేట్, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్, భాగ్యనగర్ కాలనీ, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ, బీహెచ్ఈఎల్ టౌన్షిప్, హెచ్సీవై, ఇండస్ట్రియల్ ఏరియాలతోపాటు బల్క్ తాగునీటి కనెక్షన్లు, ఆఫ్ టేక్ పాయింట్లకు వాటర్సప్లై నిలిచిపోతుందని పేర్కొన్నారు.
