
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 857 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 2,51,183 కు చేరగా మరణాల సంఖ్య 1381 కి చేరాయి. నిన్న ఒక్కరోజే 1504 మంది కోలుకున్నారు. మొత్తం నిన్నటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,30,568 కు చేరింది. ఇంకా 19239 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 250 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.