చింతకాని, వెలుగు: తనకు రావాల్సిన ఆస్తిని తన చెల్లి పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్చేస్తారని ఓ రైతు తహసీల్దార్ ఆఫీస్లో ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం వందనం గ్రామానికి చెందిన సీతారాములు కొడుకు కృష్ణ. ఇటీవల సీతారాములు కొడుకును సంప్రదించకుండా ఎకరం పొలాన్ని కూతురు పేరు మీద రాసేశాడు.
ఈ విషయం తెలుసుకున్న కృష్ణ తనని అడగకుండా ఎలా రిజిస్ట్రేషన్చేస్తారని కొన్నిరోజులుగా తహసీల్దార్ఆఫీస్చుట్టూ తిరుగుతున్నాడు. తన తండ్రికి అధికారులు సహకరించారనే కోపంతో గురువారం ఉదయం భార్య, కూతురుతో కలిసి తహసీల్దార్చాంబర్కు వచ్చాడు. పొలం తిరిగి తనకు వచ్చేలా చేయాలని డిమాండ్చేస్తూ వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని సూసైడ్కు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి వారిని పీఎస్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ఇచ్చారు. కేసు ఫైల్ చేశారు.