హైవేపై తగలబడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

హైవేపై తగలబడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

తమిళనాడులో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి మంటలు రావడంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో బస్సు మొత్తం కాలిపోయింది. 

ధర్మపురి జిల్లా ధర్మపురి-సేలం జాతీయ రహదారిపై మంగళవారం (నవంబర్ 28న) బెంగళూరు నుంచి కేరళకు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌, కండక్టర్‌లు కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు.

ప్రమాద విషయం తెలియగానే పోలీసు ఉన్నతాధికారులు ఘటనస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణాలు ఏంటి అనే దానిపై విచారణ చేస్తున్నారు.