- ఖాళీ స్థలంలో పడటంతో తప్పిన ప్రమాదం
మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ బుధవారం మధ్యాహ్నం కురిసిన గాలివానకు కూలిపోయింది. అయితే పక్కనే ఉన్న ఖాళీ జాగాలో పడడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలంలోని 11 కేవీ కరెంట్ వైర్లపై హోర్డింగ్ పడడంతో రెండు స్తంభాలు కూలాయి. 2 గంటల పాటు కరెంట్సరఫరా నిలిచిపోయింది.
పక్కనే ఉన్న గ్యారేజీకి రిపేరుకు వచ్చిన కారు నుజ్జునుజ్జయింది. హోర్డింగ్కు పర్మిషన్ఇవ్వొద్దని సీడీఎంఏతో పాటు పీర్జాదిగూడ కార్పొరేషన్ అధికారులకు 7 నెలల కిందట ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

