మొబైల్ షాప్‌లో చోరీ.. కేటుగాళ్ల‌ను ప‌ట్టించిన సీసీటీవీ ఫుటేజీ

మొబైల్ షాప్‌లో చోరీ.. కేటుగాళ్ల‌ను ప‌ట్టించిన సీసీటీవీ ఫుటేజీ

హైదరాబాద్ : న‌‌గ‌రంలోని జగదీష్ మార్కెట్ లోని ఓ మొబైల్ షాప్ లో మొబైల్ చోరీ అయింది. మార్కెట్ లోని ఎమ్.జె. షాప్ లోనికి ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో వచ్చి … షాప్ నిర్వాహకుడిని మాటల్లో పెట్టి మొబైల్ ను దొంగిలించారు. ఈ వ్యవహారం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో షాప్ యజమాని అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.