భూపాలపల్లి  మండలంలో గొడవలతో తండ్రిని కొట్టి చంపిన కొడుకు

భూపాలపల్లి  మండలంలో గొడవలతో తండ్రిని కొట్టి చంపిన కొడుకు

భూపాలపల్లి రూరల్ వెలుగు :  భూపాలపల్లి  మండలం దూదేకులపల్లి గ్రామంలో  తండ్రిని చంపిన  కొడుకు మూడ్రోజుల పాటు ఇంట్లోనే  డెడ్​బాడీని దాచాడు. దుర్వాసన భరించలేక శవాన్ని మాయం చేస్తుండగా గ్రామస్తులకు దొరికిపోయాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో గుమ్మడి తిరుపతి తన కొడుకు(మైనర్​)తో  కలిసి ఉంటున్నాడు.  తిరుపతి భార్య సంవత్సరం కింద చనిపోవడంతో ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు.  కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఈ క్రమంలో గురువారం రాత్రి పెద్ద గొడవ జరగడంతో కోపంతో కొడుకు తీవ్రంగా కొట్టడంతో తిరుపతి(48) చనిపోయాడు.

డెడ్​బాడీని ఇంట్లో దాచిపెట్టిన కొడుకు  ఏమి తెలియనట్లే ఊరివాళ్లతో ప్రవర్తించాడు. చనిపోయి మూడు రోజులు కాగా శవం నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆదివారం పొద్దున  దుప్పట్లో చుట్టుకొని  బైక్​పై వేసుకుని దగ్గరలో ఊర చెరువులో పడేసేందుకు  ప్రయత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతన్ని నిలదీయడంతో తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం తరలించారు.