పెంపుడు కుక్కే ప్రాణం తీసింది

పెంపుడు కుక్కే ప్రాణం తీసింది

లక్నో: ఉత్తరప్రదేశ్​లో ఘోరం జరిగింది. ప్రేమగా పెంచుకున్న కుక్కే ఓ మహిళ ప్రాణం తీసింది. పిట్ బుల్ డాగ్​ దాడి చేయడంతో 82 ఏండ్ల పెద్దావిడ చనిపోయింది. లక్నోలోని ఖైసర్ బాగ్ ఏరియాలో రిటైర్డ్ టీచర్ సుశీలా త్రిపాఠి నివాసం ఉంటున్నారు. ఆమె పిట్ బుల్ డాగ్ ను పెంచుకుంటున్నారు. మంగళవారం బంగ్లా మీద ఉన్న సుశీలపై పిట్ బుల్ ఒక్కసారిగా దాడి చేసింది. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న సుశీలను పని మనిషి చూసి ఆమె కొడుకుకు సమాచారం అందించింది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ యోగేశ్ కుమార్ బుధవారం చెప్పారు. పిట్ బుల్ ను పెంచుకునేందుకు బాధితురాలి కుటుంబానికి లైసెన్స్ ఉందో లేదో తెలియదని మున్సిపల్ అధికారులు తెలిపారు. కాగా, పిట్ బుల్ డేంజరస్ డాగ్. దీన్ని పెంచుకోవడం ప్రమాదకరం. కొన్ని దేశాల్లో దీనిపై నిషేధం ఉంది.