మూడు సేవలకు మాత్రం ఆధార్‌ తప్పనిసరి

మూడు సేవలకు మాత్రం ఆధార్‌ తప్పనిసరి

ఆధార్‌ కార్డు రాజ్యాంగబద్దమైనదేనని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో బాగంగానే బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాగే మొబైల్‌ కనెక్షన్లకు కూడా అవసరం లేదని చెప్పింది. స్కూలు అడ్మిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే మిగ‌తా సేవల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఆధార్‌ను మాత్రం  మూడు సేవ‌ల‌కు క‌చ్చితంగా వినియోగించాల్సిందేన‌ని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

…దేశంలో న‌కిలీ పాన్ కార్డుల‌ను ఇబ్బడి ముబ్బ‌డిగా సృష్టించి ప‌న్ను క‌ట్ట‌కుండా చాలా మంది తప్పించుకుంటున్న క్రమంలో అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఆధార్‌ను పాన్ కార్డుల‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

… ప్ర‌భుత్వాలు అందించే సంక్షేమ ప‌థకాలు, స‌బ్సిడీల‌ను పొందేందుకు లబ్దిదారులు త‌మ ఆధార్ కార్డు వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి.

….ఆధార్‌ను పాన్ కార్డుతో అనుసంధానం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి కావడంతో పౌరులు త‌మ ఆదాయ‌పు ప‌న్ను వివ‌రాల‌ను స‌మ‌ర్పించేట‌ప్పుడు (ఇన్‌కమ్‌ట్యాక్స్ రిట‌ర్న్స్‌ ఫైలింగ్) కూడా ఆధార్ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి.