హైదరాబాద్ నగరానికి చెందిన ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని రషికా తౌఫిక్ మున్షీ, ఐసీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలలో 99% మార్కులను సాధించడంతో రాష్ట్రంలో రెండవ ర్యాంకును సాధించింది. ఈ పరీక్షలలో రాష్ట్రంలోనే సైన్స్ టాపర్ గానూ ఆమె నిలిచారు.నగరంలోని నాసర్ స్కూల్ విద్యార్థిని అయిన రషికా , తల్లిదండ్రులు వృత్తిపరంగా దంత వైద్యులు. రషికా తన 10వతరగతిలో కూడా డిస్టింక్షన్ సాధించడంతో పాటుగా తన స్కూల్ టాపర్గా నిలిచారు. ప్రస్తుతం ఆమె జెఈఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు.
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆకాష్ చౌదరి రషికాను అభినందించారు ‘‘ మా విద్యార్థిని రషికాను అభినందిస్తున్నాను. ఆమె పడిన కష్టం, ఆమె తల్లిదండ్రులు అందించిన మద్దతు, ఆకాష్ వద్ద అందించిన నాణ్యమైన బోధన, మెంటారింగ్, మార్గనిర్దేశకత్వంకు ప్రతీక ఇది. పరీక్షల కోసం సిద్ధమవుతున్న మా విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలలో సైతం వారు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.