ఢిల్లీ రిజల్ట్స్: దూస్కెళ్తున్న ఆప్

ఢిల్లీ రిజల్ట్స్: దూస్కెళ్తున్న ఆప్

న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ లీడ్ లో కొనసాగుతున్నారు. కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.  బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోతున్నప్పటికీ… 2015తో పోల్చితే బెటర్ పెర్ఫామెన్స్ ఇస్తోందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు బీజేపీ గెల్చుకుంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 65 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయి. కానీ.. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి 19 స్థానాల్లోనే బీజేపీ ఆధిక్యం చూపిస్తోంది.  కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖాతా తెరిచేలా కనిపిస్తోంది. బల్లిమారన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి హరూన్ యూసుఫ్ ఆధిక్యంలోకి వచ్చారు. ఢిల్లీలో నార్త్ ఢిల్లీలోని 3 స్థానాల్లో కౌంటింగ్ నిలిచిపోయింది. షకుర్ బస్తి, ఆదర్శ్ నగర్, మోడల్ టౌన్ లలో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆ కౌంటింగ్ సెంటర్ లో పరిస్థితిని రివ్యూ చేస్తున్నారు.