న్యూఢిల్లీ: ఈ నెలలోనూ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠంకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా హీట్ వేవ్ రోజుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు తెలిపింది. ఉత్తర, మధ్య భారతదేశంలో తీవ్ర వడగాల్పులు ఉంటాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మోహపాత్ర బుధవారం మీడియాకు వెల్లడించారు.
రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ రీజియన్లో 8–11 రోజులపాటు హీట్వేవ్స్ ఉంటాయని తెలిపారు. అలాగే, రాజస్థాన్ మిగతా ప్రాంతాల్లో, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చత్తీస్గఢ్లోని కొన్నిప్రాంతాలు, ఒడిశా మారుమూల ప్రాంతాలు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్, ఉత్తర కర్నాటక, తెలంగాణలో 5–7 రోజులపాటు హీట్వేవ్స్ ఉంటాయని వివరించారు. మిగతా చోట్ల 3 రోజులపాటు వేడిగాలులు వీస్తాయని తెలిపారు.