టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్ నిలిచింది. 2026, మార్చి 8న గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్లో రాణించి ఫైనల్ పోరును ఏకపక్షంగా మార్చి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది.
ఓవరాల్గా మూడుసార్లు (2007, 2024, 2026) టీ20 వరల్డ్ కప్ను టీమిండియా ముద్దాడింది. ఈ విజయంతో టీమిండియా పలు రికార్డులు నమోదు చేసింది. టీ20 వరల్డ్ కప్కు అతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే.. వరుసగా రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా కూడా ఇండియా రేర్ ఫీట్ నెలకొల్పింది.
గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) రాణించారు. చివర్లో శివమ్ దూబే 8 బంతుల్లో 26 రన్స్ చేసి మెరుపు ఫినింగ్ ఇచ్చాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3 వికెట్లు సాధించాడు. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్య ఛేధనకు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే చాపచుట్టేసింది. ఆది నుంచి భారత బౌలర్లు బెంబేలెత్తించడంతో ఏ దశలోనూ న్యూజిలాండ్ ఛేధన వైపు సాగలేదు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ సీఫెర్ట్ ఒక్కడే హాఫ్ సెంచరీతో (52) ప్రతిఘటించాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 43 పోరాడాడు. మిలిగిన బ్యాటర్లంతా చేతులేత్తేయడంతో వరల్డ్ కప్కు అడుగు దూరంలోనే న్యూజిలాండ్ బోల్తా కొట్టింది.
