గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఆప్..

గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఆప్..

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు సోమవారం ( జూన్ 23 ) వెలువడ్డాయి. గుజరాత్ లోని విసావాదర్, కడి స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ, ఆప్ లు చెరొక స్థానంలో విజయం సాధించాయి. విసావాదర్ లో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ పై 17 వేల 554 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గోపాల్ ఇటాలియా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆప్ పార్టీకి ఇది మంచి మైలేజ్ ఇచ్చే విజయం అని చెప్పాలి. అందులోను మోడీ ఇలాఖా అయినా గుజరాత్ లో గెలుపొందడం ఆప్ పార్టీ నైతిక స్తైర్యాన్ని కూడా పెంచుతుందని చెప్పాలి.

21 రౌండ్ల పాటు జరిగిన ఓట్ల లెక్కింపులో 15 రౌండ్ల వరకు గోపాల్, కిరీట్ ల మధ్య ఆసక్తికరమైన పోరు సాగింది. ఎట్టకేలకు హోరాహోరీ పోరులో గోపాల్ ఇటాలియా విజయం సాధించారు. 75 వేల 942 ఓట్లు సాధించిన గోపాల్ ఇటాలియా బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ పై 17 వేల 554 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నితిన్ రాన్ పరియా కేవలం 5 వేల 501 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

►ALSO READ | చర్చలతో సమస్యను పరిష్కరించుకోండి

అయితే, కడిలో బిజెపి అభ్యర్థి రాజేంద్ర చావ్డా ఘన విజయం సాధించారు. మొదటి నుంచి స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించిన రాజేంద్ర చావ్డా 99,742 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి రమేష్ చావ్డాను 39,452 ఓట్ల తేడాతో ఓడించారు, ఆయనకు 60,290 ఓట్లు పోల్ అయ్యాయి.గుజరాత్‌లోని విశావదర్, కాడి అసెంబ్లీ స్థానాలకు జూన్ 19న పోలింగ్ జరిగింది. విశావదర్‌లో 56.89శాతం పోలింగ్ నమోదవ్వగా, కాడిలో 57.90శాతం పోలింగ్ నమోదైంది.

కడిలో, బిజెపి ఎమ్మెల్యే కర్సన్‌భాయ్ సోలంకి మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది.. దీంతో బీజేపీ రాజేంద్ర చావ్డాను కాంగ్రెస్‌కు చెందిన రమేష్ చావ్డా, ఆప్‌కు చెందిన జగదీష్ చావ్డాపై పోటీకి నిలిపింది. విశావదర్ సిట్టింగ్ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్ ఆప్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ పార్టీ కిరీట్ పటేల్ ను బరిలోకి దింపగా, కాంగ్రెస్ నితిన్ రాణపరియాను బరిలోకి దింపింది.