చర్చలతో సమస్యను పరిష్కరించుకోండి : ప్రధాని మోదీ

చర్చలతో సమస్యను పరిష్కరించుకోండి : ప్రధాని మోదీ
  • ఇరాన్ అధ్యక్షుడికిప్రధాని మోదీ ఫోన్ 

న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు  మసౌద్ పెజెష్కియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. ‘‘ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడాను.

 ప్రస్తుత పరిస్థితిపై చర్చించాను. ఉద్రిక్తతలు పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేశాను.  వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాలని సూచించాను. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పాను. వీలైనంత తొందరగా శాంతి నెలకొనేలా చూడాలని కోరాను” అని సోషల్ మీడియాలో మోదీ పోస్టు పెట్టారు.