ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై సబర్బన్ రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎంఆర్వీసీ) ప్రతిష్టాత్మక ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (ఎంయూటీపీ) కింద ఏకంగా 238 ఏసీ లోకల్ రైళ్లను (వందే మెట్రో) దేశీయంగానే తయారు చేయాలని నిర్ణయించింది. ముంబై సంచార రంగానికి తిరుగులేని ఊతమిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఎంఆర్వీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విలాస్ వాడేకర్ వెల్లడించారు.
గతంలో ఈ 238 ఏసీ లోకల్ రేకుల కొనుగోలు కోసం అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించినప్పటికీ, ఆ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీంతో వీటిని దేశీయంగానే తయారు చేయాలని నిర్ణయించారు.
