ఫోన్ పేలో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన నిర్మల్ జిల్లా PHC ఆఫీసర్ !

ఫోన్ పేలో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన నిర్మల్ జిల్లా PHC ఆఫీసర్ !

నిర్మల్: ఫోన్ పేలో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన  PHC ఆఫీసర్ ఉదంతం నిర్మల్ జిల్లాలో వెలుగుచూసింది. నిర్మల్ జిల్లా తానూర్లో ఏసీబీ దాడులు చేసింది. ఫోన్ పే ద్వారా లంచం తీసుకున్న తానూర్ పీహెచ్సీ అధికారి భీమన్నను ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది వేలు లంచం తీసుకుంటూ భీమన్న ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. జీపీఎఫ్, సరెండర్ లీవ్ మంజూరు కోసం‌ భీమన్న లంచం తీసుకున్నాడని ఏసీబీ తెలిపింది.

రెండు నెలల్లో రిటైర్​మెంట్​ కానున్న ఓయూ డీఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. ఓయూ బిల్డింగ్​ డివిజన్​ సిటీ రేంజ్​‌‌‌‌‌‌‌‌యూనిట్​లో రాకొండ శ్రీనివాసులు డిప్యూటీ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. మానేరు బాయ్స్​ హాస్టల్​ పునరుద్ధరణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్​కు రూ.14 లక్షల బిల్లు  రావాల్సి ఉంది.

 ఇందులో సగం వరకు బిల్లు విడుదల చేయాల్సి ఉండగా, డీఈ శ్రీనివాసులు రూ.11 వేలు డిమాండ్​ చేశాడు. సదరు కాంట్రాక్టర్​ రూ.5 వేలు బదిలీ చేశాడు. మిగతా రూ.6 వేలు కూడా ఇవ్వాలని కాంట్రాక్టర్​ను డీఈ ఒత్తిడి చేశాడు. దీంతో కాంట్రాక్టర్​ ఏసీబీని ఆశ్రయించారు. డీఈ శ్రీనివాసులు మంగళవారం రూ.6 వేలు లంచం  తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.