శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముందస్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మల సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఆగస్టు 28న రాఖీ పండుగ ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి అదే సమయంలో విదేశీ పర్యటనలో ఉండనున్నారు. ప్రతి ఏటా రాఖీ పండుగకు సీఎంకి మంత్రి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ముందస్తుగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి రాఖీ పండుగ జరుపుకున్నారు సీతక్క. వన దేవత లసమక్షంలోసీఎం రేవంత్ రెడ్డికిరాఖీ కట్టడం ఆనందంగా ఉందన్నారు మంత్రి సీతక్క.
ఇదిలా ఉంటే.. ఆదివారం (ఆగస్టు 16) సీఎం రేవంత్ రెడ్డి ములుగు, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. ములుగు పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనసముదాయాన్ని ప్రారంభోత్సవం చేశారు.మొదట మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ములుగు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు, పైలాన్ ప్రారంభించారు.
పర్యటనలో భాగంగా సమ్మక్క సారలమ్మ ఆలయంలో మొక్క నాటారు సీఎంరేవంత్ రెడ్డి. అనంతరం వితంతు,ఒంటరి మహిళ లకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేడారం సన్నిధిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను సీఎం ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లాలో పరకాలలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.
