Baby Controversy: మోసం చేశాడు.. బేబీ సినిమా దర్శకుడిపై గాయత్రీ షాకింగ్ కామెంట్స్

Baby Controversy: మోసం చేశాడు.. బేబీ సినిమా దర్శకుడిపై గాయత్రీ షాకింగ్ కామెంట్స్

దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) తెరకెక్కించిన బేబీ(Baby) సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను కేవలం ఆరు కోట్లతో తెరకెక్కించగా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా తొంబై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. 

అయితే.. ఈ సినిమా కథ తనదే అంటూ దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశాడు. తాను రాసుకున్న ప్రేమించొద్దు అనే కథను కాపీ కొట్టి బేబీ సినిమా చేశాడు అంటూ బేబీ లీక్స్ పేరుతో ఒక వీడియో కూడా విడుదల చేశాడు. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నటి గాయత్రి గుప్తా కూడా దర్శకుడు సాయి రాజేష్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. సాయి రాజేష్ ఒక పాములాంటి వ్యక్తి. దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్ ప్రేమించొద్దు కథను కాపీ చేసి బేబీ సినిమా తీశాడు. 

అంతేకాదు.. బేబీ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నన్నే అనుకున్నారు. తీరా టీజర్ రిలీజ్ అయ్యాక చూసి షాకయ్యాను. గతంలో సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన కొబ్బరిమట్ట సినిమా సమయంలో కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ముందు రెండు లక్షల రెమ్యురేషన్ అని చెప్పి చివరికి పాతిక వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అలా నా విషయంలో రెండుసార్లు మోసం చేశాడు సాయి రాజేష్. ఇక బేబీ కథ విషయంలో దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్ కు న్యాయం జరగాలి.. అంటూ కామెంట్స్ చేసింది నటి గాయత్రీ గుప్తా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి.