కాపలా కుక్క అనుకుంటే గుంటనక్క అయ్యిండు

కాపలా కుక్క అనుకుంటే గుంటనక్క అయ్యిండు

తెలంగాణ ఇస్తే..TRS ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి, కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ మోసం చేసిండని విమర్శించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అంతేకాదు దళిత సీఎం అని.. దళితులను మోసం చేసిండన్నారు. తెలంగాణ మంత్రులా కంత్రులా..అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మంత్రి మల్లారెడ్డి బూతులు తిట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అద్దంకి...సాలేగా సీఎం అని..మొదలు పెట్టాలా అని అడిగారు. అంతేకాదు..కంత్రి మల్లిగాడు ఉద్యమంలో ఎక్కడున్నాడు అని అన్నారు. రాజీనామా చేయ్..రేవంత్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు అంటూ మల్లారెడ్డికి సవాల్ విసిరారు. నీ ఇలాకా అయిన మల్కాజ్ గిరి లోనే రేవంత్ రెడ్డి గెలిచారు ..అయినా  నీకు సిగ్గు లేదా..అని అన్నారు. దమ్ముంటే గజ్వేల్ లో సీఎం రాజీనామా చేస్తే.. రేవంత్ రాజీనామా చేసి పోటీ చేస్తారని సవాల్ చేశారు. 

మల్లారెడ్డి వెనుక సీఎం కేసీఆరే వున్నాడన్న అద్దంకి దయాకర్..మంత్రి మండలిలో ఒక్కడు సదువుకున్నోడు లేడని విమర్శించారు. సన్నాసులు, దద్దమ్మలు, సొంతంగా సంతకం పెట్టనోళ్లు..కేసీఆర్ కేబినెట్ లో ఉన్నారన్నారు. మూడు చింతల పల్లి దళిత వాడల్లో సీఎం ఏం చేశారని ప్రశ్నించారు. మల్కాజ్ గిరి జిల్లాలో సీఎం, మల్లారెడ్డి పీకిందేందన్నారు. రాష్ట్రం మొత్తం తిరిగి మీ బాగోతం బయటపెడ్తామని హెచ్చరించారు. 

గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోతే..దళిత బంధు కూడా సాధ్యం కాదని.. ఎగ్గొటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్..గెలుస్తే ఎంత,ఓడితే ఎంత అంటున్నాడని తెలిపారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ములేక.. కుక్కల తో మాట్లాడిస్తున్నారన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుక్కలా కాదు.. గుంటనక్కలా మారిండన్నారు.

అంతేకాదు..సాలే గాళ్ళకు భయపడబోమని..మేము కాంగ్రెస్ లోకి పదవులకోసం రాలెదని.. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని వచ్చామని తెలిపారు అద్దంకి. TRS,MIM లను బొందపెడ్తామని హెచ్చరించారు. ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా కేసీఆర్ కేబినెట్ చూసి సిగ్గుపడుతోందన్నారు.