కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల దందా బయటపడింది. భూదాన్ పోచంపల్లి మడలం భీమనపల్లి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన కంటే మహేందర్ అనే వ్యక్తి కొంతకాలంగా చుట్టుపక్కల గ్రామాల్లో పాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అయితే నిందితుడు మహేందర్ కల్తీ పాలు తయారు చేస్తున్నడన్న సమాచారంతో మే 11వ తేదీ గురువారం ఉదయం అతడి ఇంటిలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేశారు. 

పాలను కల్తీ చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు అతడి వద్ద 80 లీటర్ల కల్తీ పాలు, 30 ఎమ్ఎస్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒక కేజీ వారమ్ స్కిన్డ్ మిల్క్ పౌడర్​ను స్వాధీనం చేసుకున్నారు. పాలను టెస్టింగ్​ కోసం ల్యాబ్‌‌కు పంపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు.