20 రోజుల కింద లవ్ మ్యారేజ్.. పెద్దలు ఒప్పుకోలేదని సూసైడ్

20 రోజుల కింద లవ్ మ్యారేజ్.. పెద్దలు ఒప్పుకోలేదని సూసైడ్

కోటగిరి, వెలుగు: ఇరవై రోజుల క్రితం జరిగిన ప్రేమపెళ్లి విషాదాంతమైంది. కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీకి  చెందిన సాయి ప్రణీత్ 20 రోజుల కింద విజయ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని, పోలీసులను ఆశ్రయించాడు. ఇరువైపులా పెద్దలకు పెళ్లి ఇష్టం లేకపోవటంతో మనస్తాపం చెందిన ప్రణీత్, విజయ.. మూడ్రోజుల కింద పురుగుల మందు తాగారు. ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ సాయి ప్రణీత్ గురువారం చనిపోయాడు. విజయ కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.