పోలీసు కస్టడీకి అడ్వకేట్ దంపతుల హత్య నిందితులు

పోలీసు కస్టడీకి అడ్వకేట్ దంపతుల హత్య నిందితులు

పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి  హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరిని కస్టడీకి కోరుతూ పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ మంథని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన మంథని కోర్టు.. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌లను వారం రోజులపాటు కస్టడీకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం నిందితులు వరంగల్‌ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు అనుమతితో నిందితులను అదుపులోకి మరింత పూర్తి స్థాయిలో విచారించనున్నారు పోలీసులు.