
ఈ మధ్య ఎయిర్ ఇండియా టైం అస్సలు బాగాలేదు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరువాత నుంచి వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. అహ్మదాబాద్ ఘటనతో జనం ఎయిర్ ఇండియా విమానం ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపుతోంది. సోమవారం ( జూన్ 23 ) ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో గాల్లో ఉండగానే వెనుదిరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
సోమవారం ఢిల్లీ నుండి జమ్మూకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనుదిరిగిందని... IX2564 విమానం దేశ రాజధాని నుండి జమ్మూకు వెళ్లాల్సి ఉండగా.. సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్తగా ఢిల్లీకి వెనుదిరిగినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా. సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్నామని.. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేశామని తెలిపింది ఎయిర్ ఇండియా.
ALSO READ | ఇరాన్ -ఇజ్రాయిల్ యుద్ధం.. రన్వేపై నిలిచిన విమానం
ఇదిలా ఉండగా.. ఆదివారం ( జూన్ 22 )జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా ఉదయం 5: 30 గంటలకు బయలుదేరాల్సిన విమానం రద్దయ్యింది. రన్వే వైపు టాక్సీయింగ్ ప్రారంభించినప్పుడు పైలట్ కాక్పిట్లో లోపాన్ని గుర్తించి... వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఆప్రాన్ కు తీసుకెళ్లాడు.
ఇంజనీర్ల సహాయంతో సుమారు నాలుగు గంటలు శ్రమించినప్పటికీ, సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని రద్దు చేసింది ఎయిర్ ఇండియా. ఈ ఘటనలో ప్రయాణికులు చాలా సేపు విమానంలో ఉండిపోయారు.