ఇరాన్ -ఇజ్రాయిల్ యుద్ధం.. రన్వేపై నిలిచిన విమానం

ఇరాన్ -ఇజ్రాయిల్ యుద్ధం..  రన్వేపై నిలిచిన విమానం

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ నుంచి ఆదివారం ఉదయం లండన్​కు బయలుదేరాల్సిన బ్రిటిష్ ఎయిర్​వేస్ విమానం (BA 276)  రన్​వేపై నిలిచిపోయింది. ఇరాన్– -ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇరాన్ గగనతలం మూసివేయడంతో టేకాఫ్​కు అనుమతి లభించలేదు. ఫలితంగా దాదాపు రెండు గంటల పాటు శంషాబాద్ విమానాశ్రయంలో రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు రెండు గంటల తర్వాత అనుమతులు లభించడంతో విమానం లండన్​కు బయలుదేరింది.