
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ నుంచి ఆదివారం ఉదయం లండన్కు బయలుదేరాల్సిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం (BA 276) రన్వేపై నిలిచిపోయింది. ఇరాన్– -ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇరాన్ గగనతలం మూసివేయడంతో టేకాఫ్కు అనుమతి లభించలేదు. ఫలితంగా దాదాపు రెండు గంటల పాటు శంషాబాద్ విమానాశ్రయంలో రన్వేపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు రెండు గంటల తర్వాత అనుమతులు లభించడంతో విమానం లండన్కు బయలుదేరింది.