మోకిలాపై భారీ అంచనాలు.. ఇవాళ (జూన్ 29) 100 ప్లాట్లు వేలం 

మోకిలాపై భారీ అంచనాలు.. ఇవాళ (జూన్ 29) 100 ప్లాట్లు వేలం 
  • నేడు 100 ప్లాట్లు వేలం వేయనున్న హెచ్ఎండీఏ 
  •     రూ. 300 కోట్ల ఆదాయంపై కన్ను  

హైదరాబాద్​సిటీ, వెలుగు:  మేడిపల్లిలో 63 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.120 కోట్లను ఆర్జించిన హెచ్​ఎండీఏ సోమవారం నుంచి రెండు రోజుల పాటు రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం మోకిలాలో100 ప్లాట్లను వేలం వేయనున్నది. సర్వేనెం. 96/పిలోని 65. 37 గుంటల భూమిలో అపార్ట్​మెంట్స్​, ఇండిపెండెంట్​ ఇండ్లు నిర్మించుకునేందుకు వీలుగా 1293 ప్లాట్లను అభివృద్ధి చేసింది. ఇప్పటికే కరెంట్, రోడ్లు, అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ, వాటర్​ సప్లయ్​, ఓవర్​హెడ్​ ట్యాంక్​ నిర్మాణం, స్ట్రామ్​ వాటర్ డ్రెయిన్​, స్ర్టీట్​లైట్స్​, వంటి రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇందులో 100 ప్లాట్లను వేలం వేయనునండగా, ఒక్కో ప్లాట్​ను 300 చ. గ.ల నుంచి 500 చ.గ. సైజుల్లో అభివృద్ధి చేశారు. చ. గజానికి కనీస ధర రూ.50వేలుగా నిర్ణయించారు. 

ప్రత్యేకతలివే..

ఈ లేఔట్​కు 100 అడుగుల రోడ్లు ఉండడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పరిసరాల్లో కూడా ఆరు 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రేడియల్​ రోడ్​-7కు చాలాసులభంగా చేరుకోవచ్చు. శంకరపల్లి నుంచి సమీపంలోని కోకాపేటలోని నియోపోలిస్​ లేఔట్​కు, విప్రోకు ఈజీగా వెళ్లొచ్చు. శంకర్​పల్లి నుంచి నుంచి ఉన్న క్రాస్​రోడ్లను కీలక ప్రాంతాలకు లింక్​చేశారు. ఫైనాన్షియల్​ డిస్ట్రిక్ట్​కు 20 నిమిషాల్లోనే  చేరుకోవచ్చు. ఓఆర్​ఆర్​ ఎగ్జిట్​-2కు చాలా దగ్గరలోనే ఉండడం వల్ల ధర ఎక్కువొస్తుందని హెచ్​ఎండీఏ భావిస్తోంది. సమీపంలోనే అనేక ప్రీమియం గేటెడ్​ కమ్యూనిటీలు, హోటళ్లు, ఇక్ఫాయ్ఏ, ఇండస్​ ఇంటర్నేషనల్​ స్కూల్​, సీబీఐటీ, ఎంజీఐటి ఉండడంతో ప్లాట్లు హాట్​ కేకుల్లా అమ్ముడవుతాయని అనుకుంటున్నారు. ఈ వేలం ద్వారా కనీసం రూ.300 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నారు.