హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: ఆఫీసులకు వెళ్లేటోళ్లు బీ కేర్ ఫుల్... ఈ ఏరియాల్లో వర్షం దంచికొడుతోంది...

హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: ఆఫీసులకు వెళ్లేటోళ్లు బీ కేర్ ఫుల్... ఈ ఏరియాల్లో వర్షం దంచికొడుతోంది...

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో  తెలంగాణలో మూడు రోజుల( మే 14 నుంచి) పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ ప్రకటించి తెలిసిందే.. తెలంగాణ లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. రోజంతా ఎండ మండిపోతున్నప్పటికీ.. సాయంత్రం అయ్యేసరికి వర్షం దంచికొడుతోంది.. ఈ క్రమంలో గురువారం ( మే 15 ) కూడా వర్షాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది.. దిల్ షుక్ నగర్, కోఠి, పంజాగుట్ట, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, యూసఫ్ గూడా, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.. ఉదయం 9 గంటల సమయానికి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని..  ఉదయం అంతా ఆఫీసుకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. అత్యవసరమైతే తప్ప వర్షం కురిసే సమయంలో బయటికి వెళ్లోద్దని సూచిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా నీటమునిగాయి. 

మండలంలోని గోగుపల్లి శివారులోని కొనుగోలు కేంద్రంలో సుమారు 150 మంది రైతులు తమ వడ్లను ఆరబోశారు. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తోడు కొనుగోలు కేంద్రానికి సమీపంలో ఉన్న ఊరవాగు ఉప్పొంగడంతో వడ్లు మొత్తం నీటిలో కొట్టుకుపోయాయి. వడ్లు లోడింగ్‌‌‌‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ.. క్వింటాల్‌‌‌‌కు 10 కిలోలు తరుగు తీయాలని మిల్లర్లు చెప్పడంతో వడ్లను కేంద్రంలోనే ఉంచామని, వర్షం, వరద వల్ల మొత్తం బస్తాలు తడిసిపోయాయని కన్నీటిపర్యంతమయ్యారు. 

విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. పంట నష్ట పరిహారం ఎంతైనా నేరుగా రైతుల అకౌంట్లలోనే జమ చేస్తుందన్నారు. ఆమె వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ బానోతు రవిచందర్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు ఇర్సవడ్ల వెంకన్న, రఘు, అప్సర్, చెన్నూరి బాలరాజు పాల్గొన్నారు. అలాగే తడిసిన వడ్లను జడ్పీ మాజీ చైర్మన్‌‌‌‌ బడే నాగజ్యోతి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మ వెంకట్‌‌‌‌రెడ్డి పరిశీలించి, రైతులను పరామర్శించారు.