కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించారు: మంత్రి కోమటిరెడ్డి

కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి  అప్పగించారు: మంత్రి కోమటిరెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని అన్నారు. నల్లగొండ జిల్లాకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల పై ఏనాడు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో కరువుకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. 

తాము వచ్చి రెండు నెలలు కాలేదని ప్రాజెక్టులు అప్పగించేందుకు ఎవరితో కుమ్మకు అయ్యామో చెప్పాలని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించారని చెప్పారు. దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు అని తీసుకొచ్చారని చెప్పారు. నల్లగొండకు వచ్చి పబ్లిక్ మీటింగ్ పెడతామని చెబుతున్నారని ఇక్కడికి వస్తే ప్రజలు తరిమికొడతారని అన్నారు. కేసీఆర్, హరీష్ రావులు చేసిన పాపానికి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.