నూతన పెన్షన్​ విధానాన్ని రద్దు చేయాలి

నూతన పెన్షన్​ విధానాన్ని రద్దు చేయాలి
  • రైల్వే ఫెడరేషన్, మజ్దూర్ యూనియన్​ డిమాండ్

సికింద్రాబాద్, వెలుగు: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే అమలు చేయాలంటూ ఆలిండియా రైల్వే ఫెడరేషన్, సౌత్ ​సెంట్రల్​ రైల్వే మజ్దూర్​ యూనియన్​ ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం సికింద్రాబాద్ డివిజన్ సంచాలన్ భవన్​ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్ రావు మాట్లాడుతూ..  రైల్వే కార్మికులకు పెన్షన్ లేకపోవడం వల్ల పదవీ విరమణ చేసిన తర్వాత వారి పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ రవీందర్, మజ్దూర్ యూనియన్ నాయకులు ఉదయ భాస్కర్, వరప్రసాద్,  ఖాజాబాబా, కృష్ణ,  పద్మావతి 
తదితరులు పాల్గొన్నారు.