హైదరాబాద్ నుంచి వెళ్లే చార్మినార్ ఎక్స్‎ప్రెస్ ఆగే చెన్నై స్టేషన్ మారింది..!

హైదరాబాద్ నుంచి వెళ్లే చార్మినార్ ఎక్స్‎ప్రెస్ ఆగే చెన్నై స్టేషన్ మారింది..!

హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక సూచన చేసింది. చెన్నైలోని ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా హైదరాబాద్– తాంబరం మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ తాంబరంకు బదులుగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుందని అధికారులు తెలిపారు. 

12760  నంబర్ (హైదరాబాద్ – తాంబరం) గల చార్మినార్ ఎక్స్‌ప్రెస్  2026, ఏప్రిల్ 5వ తేదీ నుంచి తదుపరి ప్రకటన వెలువడే వరకు తాంబరంకు బదులుగా చెన్నై బీచ్ వద్దే తన ప్రయాణాన్ని ముగిస్తుంది. అదే విధంగా 12759 నంబర్ (తాంబరం – హైదరాబాద్) గల చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 2026, ఏప్రిల్ 6వ తేదీ నుంచి తదుపరి ప్రకటన వెలువడే వరకు తాంబరంకు బదులుగా చెన్నై బీచ్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. 

►ALSO READ | మా నాన్న ఎమ్మెల్యే.. నా కారునే ఆపుతావా.. నడిరోడ్డుపై బీజేపీ నేత కొడుకు వీరంగం