న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ రిలీఫ్ దక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ (ట్విట్టర్) అఫిషియల్ అకౌంట్ను అన్బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ యువత నిరసన, ఆందోళనను వ్యక్తం చేయడానికి సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. అభిజిత్ దీప్కే స్థాపించిన ఈ పార్టీ నీట్ 2026 అవకతవకలపై సోషల్ మీడియాతో పాటు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు.. వారి తల్లిదండ్రులలో కాక్రోచ్ జనతా పార్టీ గందరగోళం సృష్టిస్తుందనే ఆరోపణలతో ఆ పార్టీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
►ALSO READ | 38 మందికి ఉరిశిక్ష: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్ప
పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై మంగళవారం (జులై 7) విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. కాక్రోజ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ను అన్బ్లాక్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీట్ పరీక్ష ముగియడంతో కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలకు అర్ధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
