మహాత్ముడి 150వ జయంతి వేడుకలపై అమిత్ షా ఫోకస్

మహాత్ముడి 150వ జయంతి వేడుకలపై అమిత్ షా ఫోకస్

ఈ ఏడాది అక్టోబర్ 2న జాతిపిత, మహాత్మ, మోహన్ దాస్ కరం చంద్ గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతటా ఘనంగా నిర్వహించాలని సూచించారు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఢిల్లీలోని పార్టీ ఆఫీస్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా సహా.. పార్టీ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఎంపీలు వీడియో లింక్ తో ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఎంపీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహాత్ముడి 150వ జయంతిపై సూచనలు, ఆదేశాలు ఇచ్చారు అమిత్ షా. అన్ని నియోజకవర్గాల్లో.. గాంధీ జయంతిని పండుగలా నిర్వహించాలని సూచించారు. ఎంపీలు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.