- టూర్ షెడ్యూల్ను హోంశాఖకు పంపిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం రూపొందించి.. దాన్ని ఆయన అనుమతి కోసం బుధవారం కేంద్ర హోంశాఖ ఆఫీసుకు పంపించింది. రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన షెడ్యూల్ ప్రకారం.. అమిత్ షా ఈ నెల 29 న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఫిలింనగర్ విస్పర్ వ్యాలీలోని జేఆర్సీ కన్వెన్షన్ లో “ప్రజాస్వామ్య తెలంగాణ కోసం సామాజిక వర్గాల సమావేశం” పేరుతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు, ఆయా వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆ తర్వాత శంషాబాద్ లోని నోవాటెల్ లో పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి తిరిగి ఢిల్లీ వెళ్తారు.