‘అమ్ము’ ట్రైలర్ విడుదల

‘అమ్ము’ ట్రైలర్ విడుదల

ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ‘అమ్ము’ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎమోషనల్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రాన్ని ఈ నెల 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. పోలీసు అధికారిని పెళ్లి చేసుకున్న అనంతరం ‘అమ్ము’ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా సినిమా రూపొందింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ‘తనను కొట్టాడమ్మ..నా  బాడీపై ఆయనకు ఏమి హక్కు ఉంది ? ఇందుకేనా పెళ్లి చేసుకుంది ?’ అంటూ  ఐశ్వర్య లక్ష్మి  చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంది.

ఫ్యామిలీ కథాంశాన్ని ఇందులో చేర్చినట్లు అర్ధమవుతోంది. గృహ హింసకు గురైన యువతి చుట్టూ సినిమా రూపొందింది. తన భర్త చేతిలో శారీరక హింసను ఎదుర్కొంటుంది. భర్తకు ఎలా బుద్ధి చెప్పిందనే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. చారుకేశ్ రచించి, దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మీ, నవీన్ చంద్ర, సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.