ఆనంద్ మహీంద్రాను క్వాలిఫికేషన్‌ అడిగిన నెటిజన్‌

ఆనంద్ మహీంద్రాను క్వాలిఫికేషన్‌ అడిగిన నెటిజన్‌

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన ట్వీట్ లతో యువతలో స్పూర్తి నింపుతారాయన.  అంతేకాకుండా తన ఫాలోవ‌ర్స్ అడిగే ప్రశ్నల‌కు చ‌మ‌త్కారంగా స‌మాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఓ ఫాలోవ‌ర్ ఆనంద్ మహీంద్రాను  మీ విద్యార్హతేంటి? అని ప్రశ్నించగా దానికి ఆయన  ‘వాస్తవంగా చెప్పాలంటే నా వయస్సులో ఏ మెరిట్‌కైనా ఏకైక అర్హత అనుభవం మాత్రమే’ అని సమాధానం ఇచ్చారు.  ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఈ ట్వీట్ కు కారణం ఓ బాలిక.  హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్న ఓ వ్యక్తి  అక్కడి పర్వత ప్రాంతంలో ఓ చిన్నారి ఒంటరిగా కూర్చుని చదువుకుంటున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఆనంద్ మహీంద్రాకి ట్యాగ్ చేశాడు.  దీనిపైన మహీంద్రా స్పందిస్తూ ఈ ఫొటో ఎంతో బాగుందని, ఆ బాలికను తాను ప్రేరణగా తీసుకుంటానని వెల్లడించారు.  ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రా విద్యార్హత గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు.