టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగింపు

టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) EO గా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పదవీకాలాన్ని  పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఈవోగా కొనసాగాలని ఉత్తర్వులో తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సింఘాల్‌ను 2017 మేలో TTD 25వ ఈవోగా డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. రెండేళ్ల పాటు ఉండే ఈ పదవిలో ఏపీ ప్రభుత్వం 2019లో మరో ఏడాది డిప్యూటేషన్‌ను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లేటెస్టుగా రెండోసారి డిప్యూటేషన్‌ను పొడిగింపు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈవో కొనసాగాలని స్పష్టం చేసింది.