
పద్మారావునగర్, వెలుగు: నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు బుధవారం ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కమిటీ చైర్మన్గా కాలేజీ ప్రిన్సిపాల్, డీఎంఈ రమేశ్ రెడ్డి, సభ్యులుగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ మోహన్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, వివిధ విభాగాల హెచ్వోడీలు, స్టూడెంట్ల తల్లిదండ్రులు, హాస్టల్ వార్డెన్లతో పాటు స్థానిక జర్నలిస్టుల తరఫున ప్రతినిధిగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ను నియమించారు.
ఈ కమిటీ ఏడాది పాటు పని చేస్తుందని, గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ను అడ్డుకునేందుకు సలహాలు, సూచనలు, చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.