అమరావతి, వెలుగు: తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కాంలో మోసపోయిన డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించింది. తొలి విడతలో భాగంగా రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.70 లక్షల మందికి రూ. 263 కోట్లు పంపిణీ చేసింది. గురువారం గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తరుపున పరిహారం చెల్లిస్తున్నామన్నారు. అగ్రిగోల్డ్ కేసు కోర్టు విచారణలో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. అగ్రిగోల్డ్ స్కాంలో గత టీడీపీ ప్రభుత్వం వాటాలేసుకుని మరీ దోచుకుందని, బాధితులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. రెండో విడత చెల్లింపుల్లో రూ. 20వేల లోపు డిపాజిటర్లకు పరిహారం అందిస్తామని ప్రకటించారు. దీని కోసం తర్వలోనే రూ. 811 కోట్లు విడుదల చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం కేటాయించిన రూ. 1,150 కోట్ల మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మూడో విడతలో రూ. 20 వేలకు పైగా డిపాజిటర్ల చెల్లింపుల కోసం హైకోర్టు అనుమతితో అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు సాయం కోసం పేర్లు నమోదు చేసుకోవడానికి నెల రోజుల పాటు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం కలెక్టరేట్, ఎమ్మార్వో, గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు 263 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన సీఎం జగన్
- ఆంధ్రప్రదేశ్
- November 8, 2019
లేటెస్ట్
- మే 23న మళ్లీ మనం మూవీ సెలబ్రేషన్స్
- జూన్ 1న బంగ్లాతో ఇండియా వామప్
- సెమీఫైనల్లో సాత్విక్, అశ్విని జోడీలు
- మాకు ట్రయల్స్ వద్దు ప్రశాంతత కావాలి: మహిళా రెజ్లర్ల వినతి
- ఓజీ ఈజ్ బ్యాక్.. జులై చివరికల్లా పోర్షన్ కంప్లీట్
- అథ్లెట్లు డోపింగ్లో పట్టుబడితే కోచ్లకూ శిక్ష
- హిట్ లిస్ట్ మూవీ టీజర్ను రిలీజ్ చేసిన సూర్య
- బాక్సర్ పర్వీన్పై సస్పెన్షన్ వేటు
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి