పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. ఆప్, కాంగ్రెస్ పార్టీలు విమర్శల బాణాలు సంధించుకుంటున్నాయి. నువ్వే-నేనా అన్న స్థాయిలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందకు తనపై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో తనపై అనేక అసత్యాలను ప్రచారం చేశారని..గర్నవర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు సత్యమే గెలుస్తుంది. ఈ కేసుపై రోపార్ అడ్మినిస్ట్రేషన్ క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. బ్రిటీష్ పాలకులు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. అదే విధంగా కేజ్రీవాల్ అతని ఢిల్లీ కుటుంబం పంజాబ్ ను దోచుకోవడానికి వచ్చారని చన్నీ ఆరోపించారు.
మరిన్ని వార్తల కోసం